Kiara Advani | ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహమాడింది అగ్ర కథానాయిక కియారా అద్వాణీ. ‘షేర్షా’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అక్కడే ఈ జంట మధ్య ప్రేమ చిగురించింది. అనంతరం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న కియారా అద్వాణీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. భర్త సిద్ధార్థ్ మల్హోత్రా తనకు లవ్ ప్రపోజ్ చేసిన క్షణాలను గుర్తుచేసుకుంది. ఆమె మాట్లాడుతూ..
‘సిద్ధార్థ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓసారి రోమ్ టూర్కు వెళ్లాను. అక్కడ ఓ రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ చేసిన తర్వాత రోమ్ వీధుల్లో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు ఓ వ్యక్తి మా దగ్గరకు వచ్చి వయోలిన్ ప్లే చేస్తూ పాట వినిపించాడు. వెంటనే సిద్ధార్థ్ మోకాళ్లపై కూర్చొని ‘షేర్షా’ సినిమాలోని ‘ఢిల్లీ కా సీదా సాదా లుండా హూ’ (ఢిల్లీకి చెందిన ఓ సాధారణ అబ్బాయిని) అనే డైలాగ్ చెప్పి లవ్ ప్రపోజ్ చేశాడు. ఏదో తెలియని ఆనందంలో వెంటనే ప్రేమకు అంగీకారం తెలియజేశా. మా స్నేహితుడొకరు ఈ సంఘటనను వీడియో తీశారు. నా జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది.