‘వార్-2’ చిత్రం ద్వారా అగ్ర హీరో ఎన్టీఆర్ బాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన హృతిక్రోషన్తో కలిసి నటించబోతున్నారు. యష్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా రానున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్నది.
ఈ సినిమాలో కథానాయికల ఎంపిక కోసం దర్శకుడు కసరత్తులు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ సరసన కియారా అద్వాణీని కథానాయికగా ఖరారు చేశారని సమాచారం. పలువురు అగ్ర నాయికల పేర్లను పరిశీలించి చివరకు ఈ అమ్మడి వైపే మొగ్గుచూపారని తెలిసింది. ఈ భామ తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాల్లో కథానాయికగా నటించింది. ‘వార్-2’ చిత్రాన్ని దాదాపు 300కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.