కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కొత్త ప్రాజెక్ట్ ‘అదల్ బదల్’ ముందుకు కదలడం లేదు. ఇద్దరి ఆత్మలు పరస్పరం మారడం అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరిగాయి. ఏడాదిగా ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నా..ప్రీ ప్రొడక్షన్ పనులు గానీ, సినిమా సెట్స్ మీదకు వెళ్లే సన్నాహాలు గానీ మొదలవలేదు. దీంతో ఈ సినిమా సందిగ్ధం నుంచి బయటకు రాలేదనే తెలుస్తున్నది.
సునీర్ క్షేత్రపాల్ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. సినిమా అప్డేట్పై ఈ చిత్ర బృందంలోని ఒక సభ్యుడు స్పందిస్తూ…‘సిద్ధార్థ్, కియారాలకు ఈ కథ బాగా నచ్చింది. కథ నచ్చడం అంటే సినిమా ఒప్పుకున్నట్లు కాదు. ఈ చిత్రానికి భారీ వీఎఫ్ఎక్స్ అవసరం అలాగే కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. షెడ్యూల్ చేసుకున్న పనులు ఆలస్యమవడం వల్ల ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదు’ అని చెప్పారు.