Kiara Advani – Sidharth Malhotra | ఈ ఏడాది చాలా మంది సినీ సెలబ్రిటీలు బ్యాచిలర్ లైఫ్కు గుడ్బై చెప్పి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నయనతార-విఘ్నేష్ శివన్, ఆలియా-రణ్బీర్, హన్సిక-సోహెల్, నాగశౌర్య వంటి సెలబ్రిటీలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కాగా, కొత్త ఏడాదిలో మరో జంట పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లవ్ బర్డ్స్గా పేరొందిన కియారా అడ్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర వచ్చే ఏడాది ఫ్రిబ్రవరిలో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సమాచారం.
వీరిద్దరూ గత కొన్ని రోజులుగా పార్టీలు, పబ్బులు, విదేశీ పర్యటనలు అంటూ చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే ఈ సారి మాత్రం ఆ ప్రచారం నిజమయ్యేలా ఉంది. వచ్చే ఏడాదిలో వీరు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది.
ఫిబ్రవరి 6వ తేదీన వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీటౌన్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో వివాహానికి సంబంధించిన హల్దీ, సంగీత్.. ఇతర కార్యక్రమాలు ముంబయిలో జరుగుతాయని, అలాగే వీరి వివాహం మాత్రం రాజస్థాన్ జైసల్మీర్ ప్యాలెస్లో జరగనున్నట్టు సమాచారం. వీరి పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు, పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినా.. ఫిబ్రవరి 6న మాత్రం వీరి పెళ్లి ఖాయమని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
జనవరిలో తమ పెళ్లి గురించి అఫీషియల్గా సిద్ధార్థ్, కియారా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వీరిద్దరూ ‘షేర్షా’ సినిమాలో తొలిసారి స్క్రీన్ పంచుకున్నారు. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కియారా.. రామ్చరణ్, శంకర్ కలయికలో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక సిద్ధార్థ్ ప్రస్తుతం రష్మిక మందనతో కలిసి నటించిన ‘మిషన్ మజ్ను’ సినిమా ప్రమోషన్స్లో బిజీ బిజీగా ఉన్నాడు.