తెలుగు, తమిళ సినీ పరిశ్రమలను అందం, అభినయంతో షేక్ చేసిన తారల్లో టాప్ ప్లేస్లో ఉంటారు అలనాటి తారలు ఖుష్బూ (Khushbu Sundar), రంభ (Rambha). వీరిలో ఖుష్బూ యాక్టింగ్ కొనసాగిస్తుండగా..రంభ మాత్రం ఫ్యామిలీ లైఫ్తో బిజీగా అయిపోయింది. ఈ ఇద్దరూ ఒక్క చోట చేరితో ఎలా ఉంటుంది. ఆ ఫొటోనే ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ వీరిద్దరు కలవడానికి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా..? క్యాజువల్ మీట్లో భాగంగానే ఇలా ఒక్క చోట చేరినట్టు తాజా స్టిల్స్ తో అర్థమవుతోంది. చెన్నైలోని నివాసంలో రంభ , ఆమె పిల్లలను కలిసింది ఖుష్బూ.
రుచికరమైన బిర్యానీ (delicious Biryani) వంటకాలను ఆరగించారు. ఈ ఇద్దరు నటీమణులు తమ పాత జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకున్నారు. రంభతో దిగిన సెల్ఫీని, ఆమె పిల్లలు, ఇతర కుటుంబసభ్యులతో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో మెరిసింది ఖుష్బూ. రంభ పెళ్లయిన తర్వాత అమెరికాలో సెటిల్ అయింది. ఈ బ్యూటీ సినిమాల్లో కనిపించక చాలా కాలమే అవుతుంది.
ఈ ఏడాది మహాసముద్రం సినిమాలో రంభ పేరుతో ఓ పాట కూడా రాగా..నెట్టింట్లో ట్రెండింగ్గా నిలిచింది. రంభ మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడొస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.