‘కేజీఎఫ్’ ఘన విజయంతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు కన్నడ హీరో యష్. గతేడాది ఏప్రిల్లో ‘కేజీఎఫ్ 2’ విడుదలైంది. అప్పటి నుంచి తన కొత్త సినిమాను ప్రకటించలేదు యష్. అయితే ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్లో ఈ యాక్షన్ హీరో తన కొత్త సినిమా చేయాల్సిఉంది. ఈ సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ను కన్నడలో విడుదల చేసింది. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘మఫ్టీ’ చిత్ర దర్శకుడు నర్తన్ను ఈ సినిమాకు దర్శకుడిగా ఎంచుకున్నారని గతంలో వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ బాధ్యతలను ప్రముఖ దర్శకుడు శంకర్కు అప్పగించినట్లు సమాచారం. యష్ కొత్త సినిమాను శంకర్ రూపొందిస్తే పాన్ ఇండియా స్థాయిలో న్యాయం చేయగలరని నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం కమల్ హాసన్తో ‘ఇండియన్ 2’, రామ్చరణ్తో ‘గేమ్ చేంజర్’ చిత్రాలను ఏకకాలంలో రూపొందిస్తున్నారు శంకర్. వచ్చే సంక్రాంతికి ఈ రెండు సినిమాల నుంచి ఆయన బయటకు వస్తారు. ఈలోగా శంకర్, యష్ చిత్రాన్ని ప్రకటించి…వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ను సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తున్నది.