ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘కేజీఎఫ్-2’ మేనియా కొనసాగుతున్నది. భాషా భేదాలకు అతీతంగా ఈ సినిమా రికార్డు కలెక్షన్స్తో దూసుకుపోతున్నది. ఈ చిత్ర అఖండ విజయాన్ని పురస్కరించుకొని హీరో యష్ ప్రేక్షకులందరికి కృతజతలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
‘ఓ చిన్న గ్రామం చాలా ఏళ్ల నుంచి కరువుతో అల్లాడుతున్నది. వర్షాల కోసం ప్రార్థన చేయడానికి గ్రామస్తులందరూ ఓ చోటికి చేరుకుంటారు. అక్కడికి ఓ బాలుడు గొడుగు పట్టుకొని వస్తాడు. అతన్ని చూసి చాలా మంది అమాయకుడనుకుంటారు. కొందరేమో అతివిశ్వాసం అని హేళన చేస్తారు. కానీ ఆ బాలుడికి ఉన్నదేమిటో తెలుసా.. నమ్మకం. నేను ఆ చిన్నారి బాలుడిలాంటివాణ్ణి కాబట్టే ఈ రోజు ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. మీ అందరికి కృతజత చెప్పడం చాలా చిన్న విషయమవుతుంది. అయినా తప్పడ చెప్పాల్సిందే. మీ అందరి ప్రేమాభిమానాల వల్లే ‘కేజీఎఫ్’ టీమ్కు ఇంతటి అద్భుత విజయం సాధ్యమైంది. సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు’ అని యష్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.