యష్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కోలార్ బంగారుగనుల నేపథ్యంలో రొమాంచితమైన యాక్షన్ ఎంటర్టైనర్గా మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమాకు ‘కేజీఎఫ్-2’ పేరుతో సీక్వెల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తొలిభాగానికి లభించిన అపూర్వ ఆదరణ దృష్ట్యా సీక్వెల్పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చిత్ర టీజర్ సోషల్మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జూలై 16న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుం కరోనా సెకండ్వేవ్ దృష్ట్యా దసరాకు రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్దత్ అధీరాగా ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్రాజ్, అనంత్నాగ్, రావు రమేష్ తదితరులు ఇతర తారాగణం. హోంబలే ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది.