బాహుబలి తర్వాత సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన చిత్రం కేజీఎఫ్. కన్నడ హీరో యష్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రానికి సీక్వెల్గా కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కించగా, జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ చాప్టర్-2 రిలీజ్ కానుందని కరోనా ముందు ప్రకటించారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ ఆ డేట్పై దృష్టి పెట్టారు. తొలి రోజే ఎలాగైనా సినిమా చూసేయాలనే కోరికతో ఆ రోజును జాతీయ సెలవు దినం (నేషనల్ హాలీడే)గా ప్రకటించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
పరిస్థితులు పూర్తిగా తారుమారు కావడంతో చిత్రాన్ని వాయిదా వేశారు. డిసెంబర్లో విడుదల అవుతుందని అంతా అనుకున్నారు కాని తాజాగా చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 14,2022న కేజీఎఫ్ 2 చిత్రం విడుదల కానుందని పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సలార్ చేస్తుండగా, ఈ మూవీని కూడా అదే డేట్న రిలీజ్ చేస్తామని గతంలో అనౌన్స్ చేశారు. మరిప్రశాంత్ నీల్ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయా, లేదంటే సలార్ వాయిద పడుతుందా అనేది రానున్న రోజులలో తెలుస్తుంది.