తొలిచిత్రం ‘ఉప్పెన’తో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. వైష్ణవ్తేజ్. ‘ఉప్పెన’ తరువాత ఆయనను పలు క్రేజీ ఆఫర్లు వరిస్తున్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న వైష్ణవ్ మరో రెండు చిత్రాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘అర్జున్రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసిన గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా కేతిక శర్మ నటించనున్నట్లు తెలిసింది.