నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా ఆదరణ పొందిన నటి కీర్తి సురేష్. చూడ చక్కని అందంతో పాటు మంచి అభినయంతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. మహానటి చిత్రంలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్తో ప్రతి ఒక్కరి మనసులు గెలుచుకుంది. అయితే ఈ అమ్మడు తొలి చిత్రం నుండి మహానటి వరకు కాస్త బొద్దుగా కనిపించింది.. తర్వాత నుండి జీరో సైజ్లోకి మారేందుకు కృషి చేస్తుంది
రంగ్ దే చిత్రీకరణ సమయంలోను ఆమెకు సంబంధించిన ఫొటోలు కొన్ని బయటకు రాగా, అందులో కీర్తి చాలా సన్నగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. రంగ్ దే సినిమాలో కీర్తిని అలా చూసి అంతా షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోలు షేర్ చేయగా,ఇందులో మరింత బక్కచిక్కినట్టు కనిపిస్తుంది. కీర్తి ఫొటోలను చూసి నెటిజన్స్ స్టన్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కీర్తి తన ఫొటోలకు ‘నిశ్శబ్దం, యోగా నా దినచర్యలో భాగమైంది’ అంటు కామెంట్ పెట్టడం విశేషం.