మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులరాటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట చిత్రంలో కథానాయికగా నటించింది. ఇక శివ దర్శకత్వంలో తెరకెక్కిన అన్నాత్తె చిత్రంలో రజనీకాంత్ చెల్లెలిగా నటించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు చిరంజీవి చెల్లెలిగా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి తమిళ ‘వేదాళం’ చిత్రాన్ని రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇది సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన కమర్షియల్ సినిమా. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మెహర్ ఈ చిత్ర స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. అయితే వేదాళం’ ఒరిజినల్ వెర్సన్ లో అజిత్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తే.. చెల్లెలుగా లక్ష్మీ మీనన్ కనిపించింది. తెలుగు వర్షెన్లో ఎవరిని తీసుకోవాలా అని మేకర్స్ బాగా ఆలోచించి కీర్తి పేరు ఫిక్స్ చేశారట.
కీర్తి సురేష్ అయితేనే మెగాస్టార్ సిస్టర్ రోల్ కి బాగుంటుందని భావించిన మెహర్ రమేష్.. ఏడెనిమిది నెలలుగా ఆమెను ఒప్పించడానికి ట్రై చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆ పాత్రకు కీర్తి ఒప్పుకుందని, దీని కోసం అమ్మడు భారీ రెమ్యూనరేషన్ అందుకోనుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమా పూర్తయ్యాక నవంబర్ నుంచి లూసిఫర్, వేదాళం రెండు రీమేక్ లను సమాంతరంగా షూట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.