Keerthy Suresh | ఇటీవల తన చిరకాల మిత్రుడు ఆంటోనీతో కలిసి పెళ్లి పీటలెక్కింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. గోవా వేదికగా వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనితో ప్రేమ, పెళ్లి గురించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది కీర్తి సురేష్. ఇంటర్ చదవుతున్నప్పుడే ఆంటోని ప్రేమలో పడిపోయానని, దాదాపు 15 ఏండ్లుగా తమ ప్రేమాయణం కొనసాగుతున్నదని చెప్పింది.
‘ఆంటోని నాకంటే ఏడేళ్లు పెద్ద. 2010లో తను నాకు తొలిసారి లవ్ప్రపోజ్ చేశాడు. అప్పుడే నాకు ప్రామిస్ రింగ్ను బహుమతిగా ఇచ్చాడు. దానిని ఇప్పటివరకు తీయలేదు. మేమిద్దరం గత రెండేళ్లుగా పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాం. డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగుపెట్టాం. ఆంటోనికి పబ్లిక్లైఫ్లో కనిపించడం అంతగా ఇష్టం ఉండదు. కాస్త సిగ్గు ఎక్కువ. అందుకే మేమిద్దరం ఎప్పుడూ మీడియా ముందుకురాలేదు. ఆంటోనిలాంటి మంచివాడు నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అని కీర్తి సురేష్ ఆనందం వ్యక్తం చేసింది.