వరుస విజయాలతో కెరీర్లో దూసుకుపోతున్నది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శనివారం చైన్నెలో ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. గణేష్రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘లేడీ ఓరియెంటెడ్ కథ ఇది.
ఆద్యంతం అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠను పంచుతుంది. కీర్తి సురేష్ పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుంది. ఆమె గత చిత్రాలకంటే భిన్నంగా ఉంటుంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నాం’ అని చెప్పారు. కీర్తి సురేష్కు సరికొత్త ఇమేజ్ను తీసుకొచ్చే చిత్రమవుతుందని నిర్మాత ఎస్.ఆర్.ప్రభు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మాధేష్ మాణికం, ఆర్ట్: శక్తి వెంకట్రాజ్, ఫైట్స్: పీసీ స్టంట్స్.