Keerthy Suresh | సినీ లవర్స్కు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). ‘మహానటి’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ ఏడాది ‘దసరా’ సినిమాలో వెన్నెల పాత్రతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు ఫిదా చేసింది. ‘మామన్నన్’తో మంచి హిట్టందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ ఓటీటీలోకి అడుగుపెట్టబోతుంది. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులంతా ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కీర్తి సురేశ్ కూడా ఓ వెబ్ సిరీస్లో నటించబోతుంది.
కీర్తి సురేశ్ నటించబోతున్న తాజా వెబ్ సిరీస్ ‘అక్క'(Akka). బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రాధికా ఆప్టే (Radhika Apte)తో కలిసి కీర్తి ఈ సిరీస్లో నటిస్తుండగా.. ధర్మరాజ్ శెట్టి ఈ సిరీస్కు దర్శకత్వం వహించబోతున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj) బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక పీరియడ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రత్యర్థులుగా కనిపించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్పై మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ఇక నెట్ఫ్లిక్స్తో కలిసి యశ్ రాజ్ ఫిల్మ్స్ ది రైల్వే మెన్ అంటూ ఒక వెబ్ సిరీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండో ప్రాజెక్ట్ కూడా షూటింగ్ దశలో ఉంది. కాగా అక్కా మూడో ప్రాజెక్ట్ అని తెలుస్తుంది.