Keerthy Suresh | వినూత్న కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి కీర్తి సురేష్. ‘నేనుశైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటి తెలుగు తనంతో కూడిన అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది. ‘మహానటి’ చిత్రంతో కీర్తీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘మహానటి’ విజయంతో ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. కీర్తీ కూడా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది. కానీ అక్కడే ఈమె పప్పులో కాలేసింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని కథల గురించి ఆలోచించకుండా సినిమాలను చేసింది. అవి కాస్త ఫ్లాప్లుగా నిలిచాయి. మహానటి తర్వాత ఇప్పటివరకు కీర్తీ నటించిన ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. గతరెండేళ్ళుగా ఈమె హిట్టుకోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఇక తెలుగులో ఈమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పరుశురాం దర్శకత్వం వహించాడు.
రెండేళ్ళ తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో కీర్తి సురేష్ తన డబ్బింగ్ పార్ట్ను పూర్తి చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టర్ను విడుదల చేసింది. డైరెక్టర్ పరుశురాం, తమన్లతో కలిసి దిగిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోమవారం సాయంత్రం ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుంది.
Final touches for dubbing is done! Cant wait for everyone to see Super⭐@urstrulymahesh in this one. A treat for all his fans! ❤️
Love,
Kalaavathi #SarkaruVaariPaata #SVPOnMay12 pic.twitter.com/KsKub6MiG0— Keerthy Suresh (@KeerthyOfficial) May 1, 2022