Hombale Films | అగ్ర కథానాయిక కీర్తి సురేష్ ఫలితం ఎలా ఉన్న వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. అయితే ‘మహానటి’ తర్వత ఇప్పటికు వరకు ఈమెకు ఆ స్థాయి విజయం రాలేదు. ఇటీవలే రిలీజైన ‘సర్కారు వారి పాట’ పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్తోనే సరిపెట్టుకుంది. అయితే రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ‘సాని కాదియం’ కీర్తికు మంచి పేరు తెచ్చిపెట్టింది. వైలెంట్ ఉమెన్గా కీర్తి పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుండి క్రిటిక్స్ వరకు గొప్ప ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కీర్తి నాలుగు సినిమాల్లో నటిస్తుంది. అందులో రెండు తెలుగు సినిమాలు కాగా, మరో రెండు తమిళ సినిమాలు. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు మరో సినిమాను పట్టాలెక్కించింది.
ప్రముఖ రైటర్ సుమన్ కుమార్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నెక్స్ట్ సినిమా చేయబోతుంది. ఈ సినిమాకు రఘు తథా అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. కేజీఎఫ్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిలింస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో ‘దసరా’, మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమాలు చేస్తుంది.
𝐁𝐞𝐜𝐚𝐮𝐬𝐞 𝐭𝐡𝐞 𝐑𝐞𝐯𝐨𝐥𝐮𝐭𝐢𝐨𝐧 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝐚𝐭 𝐡𝐨𝐦𝐞 : தயாராகுங்கள்!#Raghuthatha @hombalefilms @KeerthyOfficial #MSBhaskar @sumank @VKiragandur @yaminiyag @RSeanRoldan @editorsuresh @tejlabani @HombaleGroup @RaghuthathaFilm pic.twitter.com/54TXBF89Pr
— Hombale Films (@hombalefilms) December 4, 2022