బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ప్రేమాయణం నడిపిన ఈ జంట డిసెంబర్ 9న రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకోనున్నారిన బీటౌన్లో టాక్ నడుస్తుంది. అయితే ఆ తేదీన ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడం పక్కా అంటూ కత్రినా కైఫ్ సన్నిహితులు చెబుతున్నారు.
రాజస్థాన్లో జరిగే ఈ వివాహ వేడుకల్లో డిసెంబర్ 7, 8 తేదీల్లో వరుసగా సంగీత్, మెహందీ వేడుకలు ప్రారంభం కానున్నాయి.9 న పెళ్లి వేడుక జరగనుంది. వెడ్డింగ్కు 200 మంది అతిధులు హాజరు కానున్నారు. పెళ్లికి మరికొద్ది రోజులే మిగిలి ఉండడంతో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లికి ఎవరు మొబైల్స్ తీసుకు రావొద్దనే కండీషన్ పెట్టారనే ప్రచారం కూడా నడుస్తుంది.
జైపూర్కు వెళ్లే ముందు… విక్కీ, కత్రినా వచ్చే వారం ముంబైలో కోర్టు వివాహం చేసుకుంటారని కత్రినా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కత్రినా, విక్కీ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నారట. అందుకనే ఇంకా పెళ్లి విషయాన్నీ కూడా అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. ప్రస్తుతం కత్రినా సినిమాల నుండి విరామం తీసుకుంది.