కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన బాలీవుడ్ ప్రేమ జంట డిసెంబర్ 9న రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లో అట్టహసంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 120 మంది బాలీవుడ్ అతిథులు.. సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి తర్వాత కొత్త జంట ముంబైకి తిరిగి వచ్చారు. పెళ్లైన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఈ జంట కొద్ది క్షణాలు ముచ్చటించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.వీరిద్దరిని ఇలా జంటగా చూసి అభిమానులు మురిసిపోయారు.
అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కత్రినా కైఫ్ తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో కత్రినా చాలా కాలం తర్వాత ఫోటోని మార్చింది. వివాహ వేడుకలో ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉన్నప్పటి ఫోటోని డీపీగా పెట్టుకుంది. సూర్యాస్తమయం సమయంలో క్లిక్మనిపించిన ఈ పిక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇదిలా ఉంటే ఈ జంట రెండు నెలల పాటు విదేశాలకు హనీమూన్ వెళ్లనుంది.
పెళ్లికి ముందు ఎక్కడికి వెళ్లిన రహస్యంగా వెళ్లే ఈ జంట మీడియ ముందు విడివిడిగా ఉండేవారు. అలా పెళ్లి వరకు వీరి రిలేషన్ విషయంలో గొప్యంగా ఉంచిన విక్ట్రీనా.. భార్యభర్తలుగా కనిపించడంతో వారి ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కత్రిన కైఫ్ టైగర్ 3, ఫోన్ భూత్ సినిమాలలో నటించనుంది. గోవింద నామ్ మేరా చిత్రంలో విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. ఆ ఇద్దరికీ ఇతర భారీ ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి.