బాలీవుడ్ యువహీరో విక్కీకౌశల్తో గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తోంది అగ్ర కథానాయిక కత్రినాకైఫ్. ముంబయిలో జరిగిన పలు సినీ వేడుకల్లో ఈ జంట కలిసి దర్శనమిచ్చారు. అయితే తమ బంధం గురించి ఇప్పటివరకు వారు ఎక్కడా పెదవి విప్పలేదు. తాజాగా ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందనే వార్తలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రేమికులకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఈ వార్తల్ని కత్రినాకైఫ్ వ్యక్తిగత వ్యవహారాల్ని పర్యవేక్షించే బృందం ఖండించింది. సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పింది. కత్రినాకైఫ్ నిశ్చితార్థం విషయంలో వస్తోన్న వార్తలు నిరాధారమైనవని పేర్కొంది. రణభీర్కపూర్తో బ్రేకప్ అనంతరం విక్కీకౌశల్తో సన్నిహితంగా ఉంటోంది కత్రినాకైఫ్. ఈ జంట ముంబయిలో సహజీవనం చేస్తున్నారని చెబుతున్నారు. నూతన సంవత్సర వేడుకల్ని ఇరుకుటుంబాలు కలిసి సెలబ్రేట్ చేసుకోవడంతో వారిమధ్య బంధం మరింత బలపడిందనే వార్తలు వినిపించాయి.