సినీ క్రిటిక్, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్కి నెల్లూరు జిల్లాలో తన ఇన్నోవా కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కంటైనర్ లారీని మహేష్ కారు వెనుక నుండి ఢీకొట్టడంతో ఆయనకు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నప్పటికీ ఆయన తల, ముక్కు,కంటికి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చెన్నై నగరంలోని అపోలో ఆసుపత్రిలో కత్తి మహేష్ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కళ్లకు నేడు శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. అయితే ఎడమ కంటి చూపు పూర్తిగా పోయిందని వైద్యులు అంటున్నారని ఆయన మేనమామ ఎం. శ్రీరాములు మీడియాతో చెప్పారు. మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగకపోవడం వలన మహేష్కు ప్రాణాపాయం లేదని తెలుస్తుంది. దళిత హక్కుల కోసం పోరాడే సోషల్ యాక్టివిస్ట్ మహేష్ గత ఏడాది రాజకీయాలలో పాల్గొన్న విషజ్ఞం తెలిసిందే.