Karthikeya 3 | 2022లో వచ్చిన ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddartha). చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్లోనూ సూపర్హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లును రాబట్టింది. అయితే ఈ సినిమా వచ్చిన రెండు ఏండ్ల తర్వాత నిఖిల్, చందుల కాంబో రిపీట్ కాబోతుంది. తాజాగా కార్తికేయ 3కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ ప్రాజెక్ట్పై నిఖిల్ సిద్దార్థ ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ.. సరికొత్త సాహసాన్ని వెతికే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం అంటూ నిఖిల్ రాసుకోచ్చాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతుండగా.. ‘కార్తికేయ 2’తో పోలిస్తే ఇది భారీ బడ్జెట్తో రూపొందించనున్నట్లు టాక్.
Dr. Karthikeya In Search of a Brand new Adventure … Soon🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI
— Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024
నిఖిల్ మరోవైపు పాన్ ఇండియా చిత్రం స్వయంభు (Swayambhu) చేస్తున్నాడు. ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళ భామ సంయుక్తామీనన్ (Samyuktha Menon) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇక హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో రానున్న ఈ సినిమాలో నిఖిల్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు.