ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ హీరో కార్తికేయ. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.ఆయన నటిస్తున్న తాజా చిత్రం రాజా విక్రమార్క.ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్లో జరగగా, ఈ వేడుకలో తనకు కాబోయే భార్యని పరిచయం చేశాడు కార్తికేయ. నవంబర్ 21న తన మ్యారేజ్ జరగనుందని , ఆ క్రమంలోనే తనకి కాబోయే భార్యని వేదిక పైకి పిలిచి పరిచయం చేశాడు. అలానే అందరు చూస్తుండగానే ప్రపోజ్ చేశాడు.
“నేనే ప్రపోజ్ చేశా. తన మెసేజ్ కోసం ఎదురుచూశా. గిఫ్టులు ఇచ్చాను. నా లైఫ్ లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టాను. ఫోనులో ప్రపోజ్ చేశా. ఆ రోజే ‘నేను హీరో అవుదామనుకుంటున్నాను. హీరో అయ్యాక మీ ఇంటికి వచ్చి అడుగుతా’ అని చెప్పా. ఫైనల్లీ… ఆ అమ్మాయిని నవంబర్ 21న పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు లోహిత. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్” అని చెప్పారు కార్తికేయ.
నిశ్చితార్థం తర్వాత కార్తికేయ తన ప్రేమ గుట్టు విప్పిన విషయం తెలిసిందే. ఆమె పేరు లోహిత (లోహిత రెడ్డి) అని, NIT (నిట్) వరంగల్లో పరిచయమైందని, మొదటి సారి (2010) ఆమెను చూసిన క్షణం నుంచి ఇప్పటికీ ఇంకా ఎప్పటికీ ఇలానే ఆ బంధం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అలా ఫ్రెండ్స్గా మొదలైన ఈ కథ.. ఇప్పుడు భాగస్వామిగా వచ్చే వరకు కొనసాగిందని చెప్పుకొచ్చారు.