Karthikeya-2 Movie Characters | హిట్టయిన సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుందంటే ప్రేక్షకులలో ఆ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి అంచనాలతోనే తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ-2’. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.6 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం రూ.20 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా నటించాడు. చందుముండేటి దర్శకత్వం వహించాడు. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది.
‘కార్తికేయ-2’ తెరకెక్కుతుందని అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను రెట్టింపు రెట్టింపు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రంలో కార్తికేయగా నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తుండగా, ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కనిపిస్తుండగా,శాంతనుగా ఆదిత్య మీనన్, సదానందగా శ్రీనివాస్ రెడ్డి, సులేమాన్ పాత్రలో వైవా హర్ష నటిస్తున్నారు. ఈ మేరకు పోస్టర్లను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూలై 22న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Unveiling the path to Lord Krishna's Truth… #Karthikeya2
The characters that drive the movie… #July22 in Theatres. @anupamahere @AnupamPKher @vishwaprasadtg @AbhishekOfficl @chandoomondeti @kaalabhairava7 @vivekkuchibotla @AAArtsOfficial @peoplemediafcy @MayankOfficl pic.twitter.com/2mXYyCR1g0— Nikhil Siddhartha (@actor_Nikhil) June 10, 2022