నిఖిల్ నటిస్తున్న చిత్రం ‘కార్తికేయ 2’ చందూ మొండేటి దర్శకుడు. ‘కార్తికేయ’ చిత్రానికి స్వీకెల్గా వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నాయిక. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రంలోని ‘నన్ను నేను అడిగా’ అనే వీడియో లిరికల్ సాంగ్ను విడుదల చేశారు.
నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన ట్రైలర్తో పాటు పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. ఘనవిజయం సాధించిన ‘కార్తికేయ’కు స్వీకెల్గా వస్తున్న ఈ చిత్రంపై అందరిలోనూ మంచి అంచనాలున్నాయి. డాక్టర్ కార్తికేయగా నిఖిల్ పాత్ర అందరికి నచ్చే విధంగా ఉంటుంది. ముగ్ధగా అనుపరమేశ్వరన్ నటన ఆకట్టుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, సహనిర్మాత: వివేక్ కూచిభోట్ల