బాక్సాఫీస్ వద్ద ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవడం సాధారణంగా జరిగేదే. అయితే ఇద్దరు హీరోల సినిమాలు రిపీటెడ్గా ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం అప్పుడప్పుడు చూస్తుంటాం. అలాంటిదే ఒక న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ (Kollywood) సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్లు కార్తీ (Karthi), శివకార్తికేయన్ (Siva Karthikeyan). ఈ ఇద్దరి సినిమాలకు తమిళంతోపాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. ఈ ఇద్దరికి రెండు భాషల్లో ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువే.
గతేడాది దీపావళి బరిలో కార్తీ నటించిన సర్దార్, శివకార్తికేయన్ నటించిన ప్రిన్స్ ఒకేసారి సందడి చేశాయి. తాజా వార్తల ప్రకారం ఈ ఇద్దరు మళ్లీ ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కార్తీ ప్రస్తుతం జపాన్ సినిమాలో నటిస్తుండగా.. శివకార్తికేయన్ మావీరన్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని లేటెస్ట్ టాక్. అయితే దీనిపై మేకర్స్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జపాన్ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. శివకార్తికేయన్ నటిస్తోన్న మావీరన్ చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్పై అరుణ్ విశ్వ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అదితి శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. మండేలా ఫేం మడొన్నే అశ్విన్ ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి.