బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం సలార్,ఆది పురుష్, ప్రాజెక్ట్ అనే చిత్రంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. స్పిరిట్ చిత్రానికి సంబంధించి ఇటీవల అనౌన్స్మెంట్ రాగా, 2023లో ఈ సినిమా విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఓ వార్త అభిమానులని థ్రిల్ చేస్తుంది.
స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ కు విలన్గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోందట. ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ న్యూస్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విలనిజం పాత్రను చాలా డిఫరెంట్గా రూపుదిద్దాడంట. ఈ క్రమంలోనే కరీనా విలన్ పాత్రలో కనిపించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం.ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషించిన విషయం తెలిసిందే.