పాన్ ఇండియన్ సంస్కృతి పెరగడంతో భాషాపరమైన హద్దులు తొలగిపోయాయి. దక్షిణాది చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఈ సినిమాల్లో భాగమయ్యేందుకు బాలీవుడ్ అగ్రనాయికలు ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కరీనాకపూర్.. ప్రభాస్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. విభిన్నమైన కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కరీనాకపూర్ నటించబోతున్నట్లు తెలిసింది. ఇందులో నెగెటివ్ షేడ్స్తో కూడిన పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లు సమాచారం. హీరో క్యారెక్టర్కు ధీటుగా శక్తివంతంగా కరీనాకపూర్ పాత్రచిత్రణ ఉంటుందని చెబుతున్నారు. ప్రభాస్ హీరోగా నటించనున్న 25వ చిత్రమిది. ఎనిమిది భాషల్లో ఈ సినిమాను విడుదలచేయబోతున్నారు. వచ్చే ఏడాది సెట్స్మీదకు వెళ్లనుంది.