పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్లు చేస్తున్నాడు. అందులో ప్రభాస్ 25వ సినిమా ఒకటి.ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన రణభీర్ కపూర్తో ‘యానిమల్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అది పూర్తి కాగానే ప్రబాస్ 25వ చిత్రంగా ‘స్పిరిట్’ సెట్స్పైకి వెళుతుంది. భారీ యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం.
టీ సిరీస్, సందీప్ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్ధ కూడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.స్పిరిట్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ విలన్గా కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం.. ప్రభాస్ 25 ‘స్పిరిట్’ క్రేజ్ మరో రేంజ్కు వెళ్లినట్లే. కాగా, ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన షూటింగ్ పూర్తి చేశారు.