దర్శక నిర్మాత కరణ్ జోహార్కు మూవీ బిజినెస్ తెలుసు అంటున్నారు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. బాలీవుడ్లోని ప్రతి అంశాన్నీ అతను ఒంట బట్టించుకున్నాడు అని చెప్పారీ యువ కథానాయకుడు. కరణ్ జోహార్ రూపొందించిన ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ సినిమా మరికొద్ది రోజుల్లో పదేళ్ల మైలురాయికి చేరుకుంటున్నది. 2012 అక్టోబర్ 19న తెరపైకి వచ్చిన ఈ సినిమా ద్వారా సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు ఆలియా భట్, వరుణ్ ధావన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ఈ సినిమా విజయంతో ఈ ముగ్గురి కెరీర్ స్థిరపడి స్టార్స్గా ఎదిగారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు సిద్ధార్థ్ మల్హోత్రా. అతను మాట్లాడుతూ….‘కరణ్కు స్టార్లతో ఎలా వ్యాపారం చేయాలో తెలుసు. మూవీ బిజినెస్లో దిట్ట. బాలీవుడ్కు సంబంధించిన ప్రతి విషయం మీద పట్టుంది. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అని చెప్పారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ‘థాంక్ గాడ్’, ‘మిషన్ మజ్ను’, ‘యోధ’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.