రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నదీ సినిమా. ఈ సినిమాను దివంగత దర్శకుడు యష్ చోప్రాకు అంకితమిస్తున్నట్లు దర్శకుడు కరణ్ జోహార్ గతంలోనే వెల్లడించారు. రణబీర్ కపూర్తో ఆలియా పెండ్లి, ప్రెగ్నెన్సీ వల్ల ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ప్రస్తుతం ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ పాట చిత్రీకరణ కోసం చిత్రబృందం కశ్మీర్ వెళ్లారు. ఈ షూటింగ్కు ఆలియా తనతో పాటు కూతురు రాహాను కూడా తీసుకువెళ్తున్నది. కశ్మీర్లోని అందమైన లొకేషన్స్లో తెరకెక్కించే ఈ పాట సినిమాకు ఆకర్షణ చెబుతున్నారు చిత్రబృందం. ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జూలై 28న తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.