రవిశంకర్, జేడీ ఆకాష్, సయ్యద్ ఇర్ఫాన్, సుమితా బజాజ్ తదితరులు నటిస్తున్న చిత్రం ‘కరాళ’. ఎమ్.శ్రీనందన్ దర్శకత్వంలో బోదాసు నర్సింహా నిర్మించారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సైంటిఫిక్ మిస్టరీ చిత్రమిది. ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. లవ్, సైన్స్, మిస్టరీ ఈ మూడు అంశాలు కలబోసిన కథ ఇది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత తెలిపారు. సుమన్శెట్టి, నవీన్ జబర్దస్త్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎమ్.బి.అల్లికట్టి, వీనస్ నాగరాజ్ మూర్తి, సంభాషణలు: జమదగ్ని మహర్షి.