Kantara Movie | ఇప్పటికీ చాలా చోట్ల ‘కాంతార’ హవానే నడుస్తుంది. సౌత్, నార్త్ అని తేడాలేకుండా ప్రతి చోట కాంతార వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. ఎలాంటి అంచనాల్లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం అక్కడ అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో నార్త్తో పాటు సౌత్లోని అన్ని భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. సినిమా రిలీజై నెల రోజులు దాటిన ఈ సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. కర్ణాటకలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా అరుదైన రికార్డు కాంతార మూవీ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి నటన వర్ణనాతీతం. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా రిషబ్శెట్టి టేకింగ్, విజన్కు ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరధం పట్టారు.
ఇప్పటికే రిషబ్శెట్టి నటన, దర్శకత్వం గురించి పలువురు సినీ సెలబ్రెటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్.. చిత్రబృందాన్ని, రిషబ్శెట్టిని సోషల్ మీడియాలో అభినందించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా రజనీ, రిషబ్శెట్టిని ఇంటికి పిలిపించి శాలువాతో సత్కరించాడు. కాంతార సినిమా గురించి రిషబ్తో చాలా సేపు మాట్లాడాడట. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి నటన సహజంగా ఉందని, ముఖ్యంగా క్లైమాక్స్లో రిషబ్శెట్టి నటన గొప్పగా ఉందని వర్ణించాడట. ఇలా సూపర్స్టార్, రిషబ్ను ఇంటికి పిలిచి అభినందించడం అంటే విశేషం అనే చెప్పాలి.
దీనిపై రిషబ్శెట్టి సోషల్మీడియాలో స్పందిస్తూ ‘మీరు ఒక్కసారి మెచ్చుకుంటే వంద సార్లు మెచ్చుకున్నట్లే. థాంక్యూ రజనీసార్. మా కాంతార సినిమా చూసినందకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక కాంతార విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని హోంబలే బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు. రిషబ్కు జోడీగా సప్తమీగౌడ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతాఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ రిలీజ్ చేశాడు. ఇప్పటివరకు ఈ చిత్రం తెలుగులో రూ.18 కోట్ల వరకు కలెక్షన్లను సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది.
ನೀವು ಒಂದ್ ಸಲ ಹೊಗಳಿದ್ರೆ.. ನೂರು ಸಲ ಹೊಗಳ್ದ೦ಗೆ ನಮಗೆ.❤️ಧನ್ಯವಾದಗಳು @rajinikanth sir ನಮ್ಮ ಕಾಂತಾರ ಚಿತ್ರ ನೋಡಿ ನೀವು ಮೆಚ್ಚಿದ್ದಕ್ಕೆ ನಾವು ಸದಾ ಆಭಾರಿ🙏🏼 #Kantara @VKiragandur @hombalefilms @gowda_sapthami @Karthik1423 pic.twitter.com/MNPSDR5jx8
— Rishab Shetty (@shetty_rishab) October 28, 2022