హైదరాబాద్: గత ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో .. ఓ సెన్షేషన్ క్రియేట్ చేసింది కాంతార. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఊహించని రీతిలో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ ఇప్పుడు ఆస్కార్స్ రేసులోనూ ఉంది. ఈ విషయాన్ని నటుడు రిషబ్ శెట్టి తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కాంతార ఫిల్మ్ ఆస్కార్స్లో రెండు కేటగిరీల్లో అర్హత సాధించినట్లు రిషబ్ తన ట్వీట్లో తెలిపారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం సంతోషకరంగా ఉందని చెప్పారు. తమకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారాయన. ఇక ఆస్కార్స్ వేడుకల్లోనూ ఈ ఫిల్మ్ మరింత మెరుస్తుందని భావిస్తున్నట్లు రిషబ్ తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు.
We are overjoyed to share that 'Kantara' has received 2 Oscar qualifications! A heartfelt thank you to all who have supported us. We look forward to share this journey ahead with all of your support. Can’t wait to see it shine at the #Oscars #Kantara @hombalefilms #HombaleFilms
— Rishab Shetty (@shetty_rishab) January 10, 2023
ఇవాళ ఆస్కార్స్ అకాడమీ రిమైండర్ చిత్రాల జాబితాను వెల్లడించిన విషయం తెలిసిందే. ఆస్కార్స్ కోసం అర్హత సాధించిన 301 చిత్రాల లిస్టును రిలీజ్ చేశారు. దాంట్లో కాంతారతో పాటు ఆర్ఆర్ఆర్, గంగూభాయ్ కతియావాడి సినిమాలు ఉన్నాయి.