దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటులు నందమూరి తారకరామారావు (NTR) నాలుగో కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheswari) ఇవాళ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా ఉమా మహేశ్వరి తన నివాసంలో చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
ఉమా మహేశ్వరి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఉమా మహేశ్వరి ఆకస్మిక మరణంతో నందమూరి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఉమా మహేశ్వరి మరణవార్త తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు జూబ్లీహిల్స్లోని ఆమె నివాసానికి చేరుకుంటున్నారు.