అగ్ర కథానాయకుడు బాలకృష్ణ 107వ సినిమాలో ప్రతినాయకుడు ఎలా ఉంటాడో చూపించారు చిత్రబృందం. విలన్ ముసలి మడుగు ప్రతాప్రెడ్డి లుక్ను విడుదల చేశారు. ఈ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించనున్నారు. ప్రతినాయకుడికి కావాల్సిన ఆహార్యం, రూపురేఖలు ఈ నటుడిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నారు. నవీన్ యేర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నది. ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు.ఈ చిత్రంలో శృతి హాసన్ నాయికగా నటిస్తుండగా..వరలక్ష్మి శరత్కుమార్ మరో కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రిషి పంజాబీ, మాటలు : బుర్రా సాయిమాధవ్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, సంగీతం : ఎస్ థమన్.