వాయు సేన పైలట్ పాత్రలో కంగనారనౌత్ నటిస్తున్న సినిమా ‘తేజస్’. సర్వేష్ మెవారా దర్శకుడు. 2016లో మన దేశం వాయుసేనలో తొలిసారి మహిళా పైలట్ను నియమించింది. దీంతో వాయుసేనతో కలిసి దేశం కోసం పోరాడే అవకాశం ధీర మహిళలకు దక్కింది. ఈ ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘తేజస్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ పైలట్ తేజస్గిల్ పాత్రలో కంగనా కనిపించనుంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ డే సందర్భంగా శనివారం ఈ సినిమా రిలీజ్ డేట్పై స్పష్టతనిచ్చారు నిర్మాతలు. వచ్చే వేసవికి చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ‘కథానుసారం ఈ సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కీలకంగా ఉం టాయి. వీఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఉంటుంది. వీటి కోసమే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాం. ఫైటర్ జెట్స్ మధ్య సాగే పోరాట సన్నివేశాలు ఆకర్షణ అవుతాయి. వీటిని ఆకట్టుకునేలా తెరపైకి తీసుకొచ్చేందుకు దర్శకుడు శ్రమిస్తున్నారు’ అని చిత్రబృందం తెలిపింది.