స్టార్ హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ప్రేమాయణంపై ఓపెన్ అయింది. తన ప్రియుడిని పరిచయం చేస్తూ తెగ సంతోషించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ హాట్ బాంబ్ కంగనా రనౌత్ టైం వచ్చింది. తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో రాబోయే ఐదేళ్లలో ఎలా కనిపించబోతున్నారు అని ప్రశ్నలు సంధించగా,దానికి ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది కంగనా.
రాబోయే ఐదేళ్లలో తల్లిగా నన్ను నేను చూడాలని అనుకుంటున్నాను. త్వరలోనే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ఉంది. అని కంగన బదులిచ్చింది. మీ జీవితంలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారా? అంటే అవునని ఆమె తెలిపారు. అంతే కాదు.. ఆ వ్యక్తి గురించి త్వరలోనే అందరికీ తెలుస్తుందని కంగనా చెప్పడం విశేషం. రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ అవార్డును స్వీకరించిన విషయం తెలిసిందే. కంగనా తన పదిహేను ఏళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసింది. ఆణిముత్యాల్లాంటి చిత్రాలతో ప్రేక్షకులని అలరించింది.
ఉక్కు మహిళ అయిన ఇందిరా గాంధీ జీవితానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుని కథను రూపొందించే పనిలో కంగన అండ్ టీమ్ వర్క్ చేస్తుంది. కాగా, రీసెంట్గా కంగనా రనౌత్ తలైవి చిత్రంతో పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో జయలలిత పాత్రను పోషించి అందరి ప్రశంసలు అందుకుంది.