Kangana Ranaut | కంగనా రనౌత్. పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ బ్యూటీ సినిమాలతో కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలుస్తూ ఫైర్బ్రాండ్గా మారింది. తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై కంగనా తండ్రి అమర్దీప్ కూడా అవననే సంకేతాలిచ్చాడు. బీజేపీ నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఎక్కడి నుంచి పోటీ చేస్తుందన్నది మాత్రం స్పష్టత రావాల్సి ఉన్నది. ఇటీవల కులులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కంగనా కలిశారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి సైతం హాజరయ్యింది.
అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుండగా.. బరిలో నిలువనున్నట్లు ఆమె తండ్రి క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపిస్తు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కంగనా చండీగఢ్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో కంగనా బిజీగా ఉన్నది. ప్రస్తుతం తేజస్, ఎమర్జెన్సీ చిత్రాల్లో నటిస్తున్నది. ఎమర్జెనీ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తున్నది. చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్లో విడుదల చేయాలని భావించారు. అయితే, వచ్చే ఏడాదికి వాయిదా పడిందని సమాచారం. కంగనాతో పాటు శ్రేయాస్ తల్పడే, అనుపమ్ ఖేర్, దివంగత సతీశ్ కౌశిక్, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.