న్యూఢిల్లీ : వివాదాల నడుమ విడుదలైన షారూక్ ఖాన్ పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్గా పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న పఠాన్ తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లపైగా గ్రాస్ వసూళ్లతో దుమ్మురేపింది. పఠాన్ మూవీపై తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రశంసలు గుప్పించింది.
పఠాన్ మూవీ విజయవంతంగా నడుస్తోందని, ఈ తరహా సినిమాలు కచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయని తాను భావిస్తున్నానని పేర్కొంది. ఇతర సినీ పరిశ్రమల కంటే వెనుకబడిన హిందీ సినిమా తిరిగి గాడినపడుతోందని తెలిపింది. ఎమర్జెన్సీ మూవీ షూటింగ్ ముగిసిన సందర్భంగా చిత్ర బృందంతో కలిసి కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడారు.
భారీ బడ్జెట్తో తెరకెక్కిన పఠాన్ ఘనవిజయం సాధించిందని నటుడు అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. భారత్లో పలు భాషల్లో విడుదలైన పఠాన్ మూవీ తొలి రోజు దేశవ్యాప్తంగా దాదాపు 50 కోట్లుపైగా వసూలు చేసిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. తొలి వారాంతంలో పఠాన్ మూవీ అద్భుత వసూళ్లతో పలు రికార్డులను చెరిపివేస్తుందని అంచనా వేస్తున్నారు.