బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ నిత్యం వివాదాలతో వార్తలలోకి ఎక్కుతుంది. తనకు అవసరం లేని విషయాల్లో కూడా దూరి లేని పోని సమస్యలను తెచ్చుకుంటుంది.ఇటీవల సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటనను ఇచ్చింది. ఇది విన్న రైతులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. అయితే కంగనా దీనిపై తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. దీన్ని ఓ ఖలీస్థానీ ఉద్యమం అని, రైతులను ఉగ్రవాదులని పేర్కొంది. సిక్ మతస్థులు ఆమెపై కేసు నమోదు చేయించారు. సుబుర్భన్ ఖన్ పోలీస్ స్టేషన్లో కంగనాపై కేసు నమోదయ్యింది.
కొందరు అయితే ఆమెకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేస్తున్నారట. చంపేస్తామంటూ బెదిరింపులకి దిగుతున్నారట. దీనిపై కంగనా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. పంజాబ్లోని బటిందాకు చెందిన ఒక వ్యక్తి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, సంబంధిత ఎఫ్ఐఆర్ ప్రతిని కంగన తన ఇన్స్ట్రాగామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
దేశానికి ద్రోహం చేసే వారికి వ్యతిరేకంగా మాట్లాడతా. అమాయక జవాన్లను చంపేసే నక్సలైట్లనూ వ్యతిరేకిస్తా. తుక్డే తుక్డే గ్యాంగ్లనూ విమర్శిస్తా. విదేశాల్లో కూర్చుని భారత్లో ఖలిస్తాన్ ఏర్పాటు కోసం కలలు కనే ఉగ్రవాదులనూ తప్పుబడతా. అయితే, ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. నన్ను చంపేస్తానని ఓ వ్యక్తి పంజాబ్లో బహిరంగంగా ప్రకటించాడు అని కంగనా పోస్ట్చేసింది.
సోనియా మీరు, మీ అత్తగారు కూడా మహిళలే కదా, ఓ మహిళపై బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని మీ(కాంగ్రెస్) ముఖ్యమంత్రికి సూచించండి’ అని కంగన విజ్ఞప్తిచేశారు.