దక్షిణాది చిత్రసీమకు మద్దతుగా నిలిచే విషయంలో ఎప్పుడూ ముందుంటుంది కంగనారనౌత్. సౌత్ హీరోల గొప్పదనాన్ని, వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ చాలా సందర్భాల్లో సోషల్మీడియాలో పోస్ట్లు చేసిందీ భామ. తాజాగా బాలీవుడ్ సినీ పరిశ్రమపై మహేష్బాబు చేసిన వ్యాఖ్యల్ని కంగనారనౌత్ సమర్థించింది. ఇటీవల ‘మేజర్’ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న మహేష్బాబు హిందీ చిత్రసీమ తనను భరించలేదంటూ వ్యాఖ్యలు చేశారు.
వీటిపై కంగనరనౌత్ స్పందించింది. మహేష్బాబు మాటల్ని పాజిటివ్ కోణంలో తీసుకోవాలని సూచించింది. ఆమె మాట్లాడుతూ ‘మహేష్ మాటల్లో వాస్తవం ఉంది. నిజంగానే బాలీవుడ్ ఆయన్ని భరించలేదు. హిందీలో ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినా వద్దనుకున్నారు. తెలుగు సినిమా అంటే మహేష్కు అపారమైన గౌరవం ఉంది. ఆ ప్రేమతోనే ఆయన అలా మాట్లాడి ఉంటారు. వాటిని వివాదాస్పదంగా చూడొద్దు. తెలుగు హీరోలు టాలీవుడ్ను ఇండియాలోనే నంబర్వన్గా మార్చారు. గత పదిహేనేళ్లుగా టాలీవుడ్ వాళ్లు చాలా కష్టపడుతున్నారు. వారి నుంచి మంచి విషయాల్ని నేర్చుకోవాలి’ అని హితవు పలికింది.