లోకనాయకుడు కమల్ హాసన్ ఒకవైపు రాజకీయాలు, మరోవైపు బిగ్ బాస్ , ఇంకోవైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. విక్రమ్ అనే టైటిల్తో ఈ సినిమా రూపొందుతుండగా, తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను ముగించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
గత కొన్ని రోజులుగా యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న ‘విక్రమ్’ మూవీ అప్ డేట్ ఏంటీ అని అభిమానులు ప్రశ్సిస్తున్న క్రమంలో సెకండ్ షెడ్యూల్ ముగిసిందని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.ఇది నెటిజన్స్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా అతి త్వరలోనే పూర్తి అవుతుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. భారీ ఎత్తున అంచనాలున్న విక్రమ్ సినిమా స్టార్ కాస్టింగ్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిలిపింది అనడంలో సందేహం లేదు.
చిత్రంలో ఫహద్ ఫాసిల్ మరియు విజయ్ సేతుపతిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమల్తో ఈ ఇద్దరు కలిసి బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది బిగ్ మల్టీ స్టారర్ రూపొందుతుండగా, ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు మరియు మలయాళం ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.