లోకనాయకుడు కమల్ హాసన్కు ఎంత ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులని కట్టిపేడిసిన కమల్ దశావతారం చిత్రంలో ఏకంగా పది పాత్రలు పోషించి ఔరా అనిపించారు. ఇప్పటికీ విభిన్న రోల్స్ చేస్తూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయాలని భావిస్తున్నారు. అభిమానుల గురించి ఎక్కువగా ఆలోచించే కమల్ రీసెంట్గా తన అభిమానికి బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసి ఫోన్లో పరామర్శించారు.
కెనడాకు చెందిన సాకేత్ అనే వ్యక్తి కమల్కు వీరాభిమాని. ప్రస్తుతం మూడో స్టేజ్లో ఉన్నాడు. తన అభిమాన నటుడు కమల్ తో ఒక్కసారైన మాట్లాడాలని ఎంతగానో అనుకునేవాడు. ఓ సారి ఈ విషయం తన మిత్రులకు చెప్పడంతో వారు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారు. కమల్ దృష్టికి ఈ విషయం రావడంతో జూమ్ కాల్ ద్వారా సాకేత, ఆయన కుటుంబ సభ్యులతో కమల్ కొద్ది సేపు మాట్లాడారు. వ్యాధిపై పోరాడి గెలవాలంటూ ధైర్యాన్ని అందించారు. నేను చెన్నైకి వస్తే మిమ్మల్ని ఒకసారి కలవొచ్చా అని అడడగా, దానికి కమల్ తప్పకుండా అని బదులిచ్చారు.