అగ్ర నటుడు కమల్హాసన్ వరుసగా సినిమాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్-2’ చిత్రంతో పాటు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్లైఫ్’లో నటిస్తున్నారు. హెచ్.వినోద్ డైరెక్షన్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలో పట్టాలెక్కనుంది. ప్రభాస్ ‘కల్కి’ చిత్రంలో కమల్హాసన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఇలా భారీ ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. తాజాగా ఆయన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు-అరివును దర్శకులుగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నారు. ‘కేహెచ్ 237’ వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ కమల్హాసన్ తన ఎక్స్ (ట్విట్టర్)లో ఓ వీడియోను విడుదల చేశారు. అన్బరివు ప్రస్తుతం దేశంలో అగ్రశ్రేణి స్టంట్ మాస్టర్స్గా కొనసాగుతున్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్తో పాటు ఇటీవల విడుదలైన ‘సలార్’కు వాళ్లే యాక్షన్ డైరెక్షన్ చేశారు. కమల్హాసన్ ‘విక్రమ్’ చిత్రాన్ని అన్బు-అరివు స్టంట్స్ మాస్టర్స్గా పనిచేశారు. ఆ సినిమా యాక్షన్ సీక్వెన్స్కు మంచి పేరొచ్చింది. ఆ సినిమా సమయంలో వారిద్దరి ప్రతిభకు మెచ్చిన కమల్హాసన్ దర్శకులుగా అవకాశమిచ్చారని చెబుతున్నారు.