దర్శకుడు మణిరత్నంతో కమల్ హాసన్ ఓ సినిమా చేయబోతున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ సినిమా భారతీయ వెండితెరపై ఓ క్లాసిక్గా మిగిలిపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వీరు కలిసి పనిచేయబోతున్నారు. సోమవారం కమల్హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. కమల్హాసన్ నటిస్తున్న 234వ చిత్రమిది. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2024లో ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటన సందర్భంగా పేర్కొన్నారు. ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్ 1’ చిత్రంతో మణిరత్నం ఘన విజయాన్ని అందుకోగా …అటు ‘విక్రమ్’ సినిమాతో కమల్ హా సన్ కూడా సూపర్ హిట్ దక్కించుకున్నారు.