అవినీతి, లంచాల వ్యవస్థ మీద పోరాటం చేసిన ‘భారతీయుడు’ అప్పట్లో సిల్వర్ స్క్రీన్పై సంచలనం సృష్టించాడు. ఈసారి సమాజంలోని మరో జాఢ్యాన్ని లక్ష్యంగా చేసుకుని మళ్లీ తిరిగొస్తున్నాడు. ‘ఇండియన్ 2’ పేరుతో కమల్ హాసన్ హీరోగా 2019లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది.
కొంత జరిపాక పాండమిక్లో చిత్రీకరణ నిలిపి వేశారు. ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా తిరిగి మొదలుపెట్టారు. సందేశాన్ని, వినోదాన్ని కలగలిపి మెప్పించిన దర్శకుడు శంకర్… ఈసారి మరింత బలంగా కథను చూపించబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్సింగ్, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో కమల్ హాసన్ షూటింగ్లో జాయిన్ కానున్నారు. లైకా ప్రొడక్షన్స్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.