కోలీవుడ్, జపాన్ చిత్ర పరిశ్రమల మధ్య వారధిగా నిలిచిన ప్రతిష్టాత్మక వేడుక ‘ఒకాసా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’. ప్రతి ఏడాదీ తమిళ సినిమాలకు ఈ వేడుకలో అవార్డులివ్వడం జరుగుతుంది. 2022వ సంవత్సరానికిగాను విజేతలను ఈ సంస్థ ఆదివారం వెల్లడించింది. కమల్హాసన్ హీరోగా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమ్’ సినిమా ఉత్తమ చిత్రంగా నిలువగా, అందులో ప్రధాన పాత్ర పోషించిన కమల్హాసన్ ఉత్తమనటుడిగా ఎంపికయ్యారు.
‘సాని కాయితం’ చిత్రానికి గాను కీర్తి సురేశ్ ఉత్తమనటిగా నిలిచారు. ఉత్తమ దర్శకుడిగా ‘పొన్నియన్ సెల్వం1’ సినిమాకు మణిరత్నం ఎంపికయ్యారు. కమల్హాసన్ ‘విక్రమ్’ సినిమా ఎనిమిది విభాగాల్లో, ‘పొన్నియన్ సెల్వం1’ ఏడు విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం విశేషం.