అగ్ర నటుడు కమల్హాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన్ని బుధవారం రాత్రి చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కమల్హాసన్ ఆరోగ్య పరిస్థితిపై గురువారం సాయంత్రం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. కమల్హాసన్కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బం ది తలెత్తిందని, వెంటనే చికి త్స మొదలుపెట్టామని, ప్రస్తు తం ఆరోగ్యం నిలకడగా ఉం దని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యాక ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కమల్హాసన్ ‘ఇండియన్-2’ షూటింగ్తో పాటు తమిళ ‘బిగ్బాస్’ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ కారణంగానే అస్వస్థతకు గురయ్యారని అంటున్నారు. బుధవారం హైదరాబాద్కు విచ్చేసిన కమల్హాసన్ తన గురువు కళాతపస్వి కె.విశ్వనాథ్ను కలిసిన విషయం తెలిసిందే.