టాలీవుడ్ హీరో సంతోష్ శోభన్ (Santhosh Soban), ప్రియా భవానీ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam). యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్పై అనిల్ కుమార్ అల్ల డైరెక్ట్ చేస్తున్నాడు. కళ్యాణం కమనీయం మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుండగా.. ఆసక్తికర వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా ఓటీటీ శాటిలైట్ రైట్స్ రూ.7 కోట్లు పలికాయట. ఈ లెక్కన కళ్యాణం కమనీయం బ్రేక్ ఈవెన్ (బడ్జెట్ రికవరీ) ను చేరుకున్నట్టేనని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకున్న మొదటి సంక్రాంతి సినిమాగా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది సంతోష్ శోభన్ టీం. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కు చేరుకోవడంతో నిర్మాతలు టార్గెట్ను సులభంగా చేరుకోవడం ఖాయమని తాజా అప్డేట్తో తెలిసిపోతుంది.
సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతున్న ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమని మేకర్స్ ధీమాగా ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రంలో దేవీ ప్రసాద్, కేదార్ శంకర్ , పవిత్రాలోకేశ్, సత్యం రాజేశ్, సప్తగిరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కళ్యాణం కమనీయం ట్రైలర్..
హో ఎగిరే లిరికల్ సాంగ్.. వీడియో
ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్..